రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బిఆర్ అంబెడ్కర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ లు కూడా అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, అసెంబ్లీ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ దయానంద్, శాసనసభ కార్యదర్శి డా. వి నరసింహా చార్యులు తదితరులు పాల్గొన్నారు.