నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించని చెప్పిన క్రీస్తు బోధనలు విశ్వమానవాళికి మార్గదర్శకమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం క్రిస్మస్ సందర్భంగా మధిర మండలం బయ్యారం గ్రామం చర్చ్ లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేకే కట్ చేశారు డిప్యూటీ సీయం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియచేశారు. మానవాళికి ప్రేమ, సౌభ్రాతృత్వం పంచిన ఏసుక్రీస్తు మార్గం మనందరికీ అనుసరణీమని భట్టి అన్నారు. అన్ని మతాల సారం మానవత్వమే అన్న డిప్యూటీ సీయం ఏసుక్రీస్తు ఎంచుకున్న మార్గం అందరికీ దిక్సూచిలాంటిదన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కూడా సర్వమత హితంగా పరిపాలన చేస్తోందని తెలిపారు.