ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట అంతరిక్షకేంద్రం రాకెట్ ప్రయోగాల్లో సెంచరీ కొట్టింది. ఉద్విగ్న వాతావరణం మధ్య చారిత్రాత్మక ప్రయోగం చేసింది. శ్రీహరికోట నుంచి ఇస్రో ఇవాళ వందో ప్రయోగం సక్సెస్ఫుల్గా చేసింది. తన వందో మిషన్ అయిన ఎన్విఎస్-02 నావిగేషన్ శాటిలైట్ను ఈరోజు ఉదయం 6.23 గంటలకు శ్రీహరికోట నుండి లాంచ్ వెహికల్ జిఎస్ఎల్వి-ఎఫ్ 15 ద్వారా ప్రయోగించింది. ఇస్రో చైర్మన్గా నారాయణన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది తొలి మిషన్.
జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ ప్రయోగం కోసం నిన్నఅర్థరాత్రి 2.53 గంటల నుంచి కౌంట్డౌన్ మొదలయ్యింది. జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ 50.9 మీటర్లు పొడవు, 2వేల 250 కిలోల బరువు ఉంది. నావిక్లో భాగమైన ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని ఇస్రో కక్ష్యలోకి పంపుతోంది. ఎన్వీఎస్-02 ఉపగ్రహం బరువు 2వేల 250 కిలోలు. కొత్తతరం నావిగేషన్ ఉపగ్రహాల్లో ఎన్వీఎస్-02 రెండోదిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎన్ఎస్వీ-01 ఉపగ్రహాన్ని 2023 మే 29న ప్రయోగించింది ఇస్రో . ఎన్ఎస్వీ-02 ఉపగ్రహాన్ని యూఆర్ శాటిలైట్ సెంటర్ డిజైన్ చేసింది.
భౌగోళిక, వైమానిక, సముద్ర నేవిగేషన్ సేవల కోసం ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. వ్యవసాయంలో సాంకేతికతకు, విమానాల నిర్వహణ కోసం ఈ ప్రయోగం చేశారు. మొబైల్ డివైజ్లలో లొకేషన్కు సంబంధించిన సేవల కోసం కూడా ఈ ఉపగ్రహ ప్రయోగం ఉపయోగపడుతుందని చెబుతున్నారు. శ్రీహరికోటలో అంతరిక్షకేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత తొట్టతొలిగా 1979లో షార్ నుంచి చేపట్టిన మొదటి ప్రయోగం రోహిణి విఫలమయ్యింది. ఆ తర్వాత వరుసగా సక్సెస్లు సొంతం చేసుకుంటూ వస్తోంది. అయితే, ఇప్పటి వరకు షార్ నుంచి ఇస్రో జరిపిన 99 ప్రయోగాల్లో 9 మాత్రమే విఫలమయ్యాయి. ఇప్పుడు వందో రాకెట్ ప్రయోగించి.. ఈ కేంద్రం సెంచరీ కొట్టేసింది.