ఏపీలో 3వేల మంది బాలికలు మిస్సింగ్ పై సీరియస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 వేల మంది బాలికలు అదృశ్యం అయ్యారని వచ్చిన ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమీషన్ స్పందించింది. ఏపీలో మూడు వేల మంది బాలికల మిస్సింగ్ పై ఓ సామాజిక కార్యకర్త గత జనవరి మాసంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును పరిశీలించిన ఎన్హెచ్ఆర్సీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి సమన్లు జారీ చేసింది. తక్షణం బాలికల అదృశ్యంపై పూర్తి స్ధాయి నివేదిక పంపాలని ఎన్హెచ్ఆర్సీ సీఎస్ ను ఆదేశించింది. ఈ అంశంపై ఎన్ని సార్లు రిమైండర్లు పంపినా ప్రభుత్వం స్పందిచకపోవడంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.2025 జనవరి 20వ తేదీ లోపల పూర్తి సమాచారంతో, అన్ని డాక్యుమెంట్లతో కమిషన్ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది