సీనియర్ సినీ నటుడు మంచు మోహన్ బాబు పోలీసులు ముందుకు విచారణకు హైకోర్టు మినహాయింపు ఇచ్చయింది. రాచకొండ పోలీస్ కమిషనర్ ముందు తనను హజరవ్వాలని నోటీసు ఇవ్వడంపై బుధవారం మోహన్ బాబు తరపు న్యాయావాదులు నవీన్ రెడ్డి, మురళీ మనోహర్లు హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. మోహన్ బాబు పిటీషన్ ని విచారించిన ఉన్నత న్యాయస్ధానం ఆయన పోలీసుల ముందుకు విచారణ హాజరవ్వడంపై మినమాయింపు ఇచ్చింది. గొడవలు పూర్తిగా మోహన్ బాబు కుటుంబ వ్యవమారమని వ్యాఖ్యానించిన హైకోర్టు ఆయన ఇంటి వద్ద పోలీసులు నిఘా పెట్టాలని సూచించింది. ప్రతి రెండు గంటలకు ఒక సారి మోహన్ బాబు ఇంటిని పర్యవేక్షించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది.