బాలీవుడ్ భామ మనుషీ చిల్లర్ స్వస్థలం హర్యానాలోని రోహ్ తక్. 1997లో జన్మించిన ఈ బ్యూటీ 2017లో విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. సోషల్ మీడియాలో సందడి చేసే మనుషీ…ఫొటోలు షేర్ చేయటం అంటూ జరిగితే కుర్రాళ్లు కళ్లప్పగించి చూడాల్సిందే…అయితే చీరకట్టే తనకు ఇష్టమని కొంటె మాటలు చెపుతోంది.
హిందీలో సామ్రాట్ పృథ్వీరాజ్, ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ, బడే మియా చోటే మియా తదితర హిందీ సినిమాల్లో మనుషీ చిల్లర్ నటనతో తన సత్తా చాటింది.
తెలుగులో వరుణ్ తేజ్ సరసన ఆపరేషన్ వాలెంటైన్ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా విజయాన్ని అందుకోలేకపోయినా మనుషీ అందానికి తెలుగు కుర్రాళ్లు ఫిదా అయిపోయారు.
హాలిడేస్ కోసం విదేశాలకు వెళ్లిన మనుషీ చిల్లర్ బికినీ సూట్ లో హొయలు అంతా ఇంత కాదు. సన్నని నడుము, ఎద అందాలను ఆరబోసి నవ్వులు చిందిస్తూ కనిపించింది.
సినిమాలు, మోడలింగ్ లో అదరగొడుతున్న ఈ అందాల భామ చదువులో కూడా టాపరే. మనుషీ తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లు కాగా నీట్ మొదటి ప్రయత్నంలోనే మెడిసన్ సీటు కొట్టిన మనుషీ సోనిపట్ లో ఎంబిబిఎస్ చదువుతోంది.