అదాని కంపెనీ నుంచి సెకీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్న సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం విషయంలో పలు మీడియా సంస్ధలు తనపై అవినీతి ఆరోపణలు చెయ్యడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నాపేరు కూడా ఎక్కడా ప్రస్తావన లేనప్పటికీ విద్యుత్ ఒప్పందాలకు ముడిపెడ్డి నాపై అనేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న మీడియా సంస్ధలకు లీగల్ నోటీసులు పంపుతా అని వెల్లడించారు. 48 గంటలలోపు విద్యుత్ కొనుగోళ్ళలో నాకు అవినీతి అంటగట్టి దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్ధలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గడువులోపు క్షమాపణలు చెప్పకపోతే ఆ మీడియా సంస్ధలపై వంద కోట్ల పరువునష్టం దావా వేస్తానని వైస్.జగన్ చెప్పారు.
- Advertisement with us -