వివాహేతర సంబంధాల్లో ఇరువురూ ఇష్టపూర్వకంగా చాలాకాలం శృంగారంలో పాల్గొని తీరా విభేదాలు తలెత్తితే పురుషుడిపై రేప్ కేసులు పెట్టే సంస్కృతి పెరగడం పై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకుంటారన్న హామీ తోనే ఖచ్చితంగా శారీరక సంబంధం పెట్టుకుంటారని చెప్పజాలమని న్యాయమూర్తులు బీవీ నాగరత్న, కోటీశ్వర్ సింగ్ లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ముంబై ఖర్గార్ స్టేషన్లో ఓ వివాహితుడి పై ఏడేళ్ల క్రితం విడో పెట్టిన కేసును కొట్టేసింది. ఈ సందర్భంగా అత్యన్నత న్యాయస్ధానం పైన పేర్కొన్న వ్యాఖ్యలు చేసింది.