జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. రాంచీలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఎస్ పి అధినేత అఖిలేష్ యాదవ్, బెంగాల్ సిఎం మమత బెనర్జీ, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ తోపాటు ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. శాసనసభ ఎన్నికల్లో జార్ఖండ్ పరిశీలకుడిగా వ్యవహరించిన భట్టిని ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు ఇండియా కూటమి నేతలు అభినందించారు. ఎన్.డి.ఏ ను ఎదుర్కోవటంలో భట్టి వ్యూహం ఫలించిందని జెెఎంఎం నేతలు ప్రశంసించారు.