గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్సఫర్మేషన్ (జీఎఫ్ఎస్టీ) శుక్రవారం విశాఖపట్నంలో నిర్వహిస్తున్న సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హజరుకానున్నారు. షేపింగ్ ది నెక్ట్స్ ఎరా ఆఫ్ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్ తో ఒక రోజు జరిగే ఈ నేషనల్ కాంక్లేవ్ లో చంద్రబాబు పాల్గొననున్నారు. ఐదు సెషన్లుగా వివిధ అంశాలపై జరిగే ఈ సదస్సులో పలు రంగాలకు చెందిన నిపుణులతో చంద్రబాబు చర్చిస్తారు. టెక్నాలజీ, కొత్త ఆవిష్కరణలతో మెరుగైన పాలన అందించడం, ప్రజల తలసరి ఆదాయం పెంచడం వంటి అనేక అంశాలే ఎజెండాగా ఈ సదస్సు జరుగుతుంది.
- Advertisement with us -