పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో అరెస్టైన భారత రాష్ట్ర సమితి శాసనసభ్యుడు పాడి కౌషిక్ రెడ్డికి అర్ధరాత్రి బెయిల్ మంజూరు అయ్యింది. గురువారం అర్ధరాత్రి ఒంటిగంటకు కొత్తపేటలో న్యాయమూర్తి నివాసంలో పోలీసులు కౌషిక్ రెడ్డిని ప్రవేశపెట్టారు. పోలీసులు సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించకుండా తప్పుడు ఆరోపణలతో ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారని కౌషిక్ రెడ్డి తరపు న్యాయవాది కిరణ్ కుమార్ న్యాయస్ధానానికి వివరించారు. లాయర్ వాదనలు పరిగణలోకి తీసుకున్న మేజిస్ట్రేట్ కౌషిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు.