ఆంధ్రప్రదేశ్లో పరమ పవిత్ర శ్రీదత్త క్షేత్ర యాత్ర కొనసాగుతోంది. ఆశ్రమాలు, ఆలయాల జీర్ణోద్ధరణ, భక్తులకు నాద చికిత్స లక్ష్యంగా ఈ యాత్ర మొదలుపెట్టారు. అవధూత దత్త పీఠాధిపతి పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఈ యాత్రను చేపట్టారు. 2025 నూతన సంవత్సరం నాడు శ్రీ దత్త క్షేత్ర యాత్ర ప్రారంభమయ్యింది. విజయవాడ, గుడివాడ, ఏలూరు మీదుగా ఈ యాత్ర విశాఖపట్నం దాకా సాగుతుంది. అనంతరం రాయలసీమ జిల్లాల్లోనూ ఈ యాత్ర చేపడతారు. శ్రీదత్త క్షేత్ర యాత్రలో భాగంగా అనేక సేవా, ఆద్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీని బుధవారం 30వేల మంది భక్తులు దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో పరమ పవిత్ర శ్రీదత్త క్షేత్ర యాత్ర కొనసాగుతోంది. ఆశ్రమాలు, ఆలయాల జీర్ణోద్ధరణ, భక్తులకు నాద చికిత్స లక్ష్యంగా ఈ యాత్ర మొదలుపెట్టారు. అవధూత దత్త పీఠాధిపతి పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఈ యాత్రను చేపట్టారు. 2025 నూతన సంవత్సరం నాడు శ్రీ దత్త క్షేత్ర యాత్ర ప్రారంభమయ్యింది. విజయవాడ, గుడివాడ, ఏలూరు మీదుగా ఈ యాత్ర విశాఖపట్నం దాకా సాగుతుంది. అనంతరం రాయలసీమ జిల్లాల్లోనూ ఈ యాత్ర చేపడతారు. శ్రీదత్త క్షేత్ర యాత్రలో భాగంగా అనేక సేవా, ఆద్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీని బుధవారం 30వేల మంది భక్తులు దర్శించుకున్నారు.