కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని కొడంగల్ కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించింది. లగచర్ల దాడి కేసులో ఏ-1గా ఉన్న నరేందర్రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కొడంగల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం. నిందితుడిని రెండు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలు నుంచి వికారాబాద్ తరలించనున్నారు. రెండు రోజుల పాటు లగచర్లలో ప్రభుత్వ అధికారులపై జరిగిన దాడి విషయంలో నరేందర్ రెడ్డిని పోలీసులు విచారణ చేయనున్నారు.