కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకు వెళ్లడంతో ఐదుగురు యువకులు దుర్మరణం చెందారు. అత్యంత విషాదకర ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ లో జరిగింది. హైదరాబాద్ కు చెందిన హర్ష, దినేష్, వంశీ, బాలు, వినయ్ అనే ఐదురుగురు యువకులు ప్రయాణిస్తున్న కారు శుక్రవారం అదుపుతప్పి చెరువులోకి దూసుకు వెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. వీరిలో మణికంఠ అనే యువకుడు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మితి మీరిన వేగం వల్లే కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకువెళ్ళినట్లు తెలుస్తోంది.