తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ వ్యవహారాలపై అధిష్టానం సీక్రెట్ మీటింగ్ పెట్టినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్ ఈ రహస్య సమావేశం నిర్వహించినట్లు సమాచారం. అయితే, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే వీళ్లను కాదని కేసీ వేణుగోపాల్ ఈ సీక్రెట్ మీటింగ్ పెట్టినట్లు సమాచరాం బయటకు వచ్చింది. వాస్తవానికి ఢిల్లీ టూర్లో ఈ ముగ్గురు ముఖ్యనేతలతో పాటు.. మరో మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి కూడా ఉన్నారు. అయితే, కేసీ వేణుగోపాల్ ఈ ముగ్గురు ముఖ్యనేతలను కాకుండా.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రహస్యంగా సమావేశమైన విషయం బయటకు వచ్చింది.
రేవంత్రెడ్డి పాలన, ప్రజల్లో పార్టీపై నెలకొన్న అభిప్రాయం, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత, పథకాల అమలు తీరు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ వైఫల్యాలపైనా ఉత్తమ్కుమార్రెడ్డితో కేసీ వేణుగోపాల్ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు రావడంతో కాంగ్రెస్పార్టీలో కలకలం చెలరేగుతోంది. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ కూడా ఢిల్లీలో ఉన్న సమయంలోనే మరో నేతతో అధిష్టానం ప్రతినిధి కేసీ వేణుగోపాల్ రహస్యంగా భేటీ కావడం వెనుక మతలబు ఏంటన్న చర్చ జరుగుతోంది.
వాస్తవానికి ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్లో పలువురు ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమైన అంశం సంచలనంగా మారింది. అలాగే, కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న కూడా పార్టీపై, ప్రభుత్వంపై బహిరంగ సభలో తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ రెండు అంశాలను సద్దు మణిగేలా చేసేందుకు ఢిల్లీ వెళ్లేముందు సీఎం రేవంత్రెడ్డి సీఎల్పీ సమావేశంలో ప్రయత్నించారు. ఆ సమస్యలకు చెక్పెట్టే ప్రయత్నం చేశారు. కానీ వీళ్లంతా ఢిల్లీ వెళ్లిన తర్వాత బాధ్యతలు నిర్వర్తిస్తున్న ముఖ్యనేతలతో కాకుండా మరో మంత్రితో కేసీ వేణుగోపాల్ రహస్య చర్చలు జరపడంపై పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.