ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో నేషనల్ హైవే పనులను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. పిడుగురాళ్ళ మీదుగా… హైదరాబాద్కు కనెక్టవిటీ చేస్తున్న ఈ రహదారితో సముద్ర తీర ప్రాంతానికి చేరుకోవడం సులువు అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో వాడరేవు- పిడుగురాళ్ల మీదుగా నేషనల్ హైవే 167ఏ పనులు బాపట్ల జిల్లాలో వేగవంతం చేశారు. ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హైవేలు, స్టేట్ హైవేల పనులు వేగవంతం చేయగా…జాతీయ రహదారుల నిర్మాణాలతో పలు జిల్లాలో రూపురేఖలు మారుతున్నాయి.
కోస్తాలో కీలకమైన వాడరేవు- పిడుగురాళ్ల జాతీయ రహదారి పనుల్లో స్పీడ్ పెంచారు. 167ఏ నేషనల్ హైవే నిర్మాణ పనులు బాపట్ల జిల్లా పర్చూరు మండల పరిధిలో జరుగుతున్నాయి. ఈ మేరకు పర్చూరును అనుసంధానం చేస్తూ కారంచేడు మీదుగా వాడరేవు వరకు రోడ్డు నిర్మాణం పనుల్లో వేగం పెంచారు. ఈ హైవే నిర్మాణంతో పాటుగా కల్వర్టులు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల పనులు చేపట్టారు.
ప్రస్తుతం చేపడుతున్న జాతీయ రహదారి నిర్మాణాలకు సమీపంలో ఉన్న గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. హైవే అధికారుల పర్యవేక్షణలో ఈ పనులు కొనసాగుతున్నాయి. 167 ఏ హైవేలో వాడరేవు – పిడుగురాళ్ల వరకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను కనెక్ట్ చేస్తోంది. ఈ మేరకు రవాణా సౌకర్యం ఏర్పడుతుంది.
హైదరాబాద్ నుంచి వాడరేవు రవాణాకు ఉపయోగంగా ఉంటుంది. ఈ మేరకు మోటుపల్లి, పెద్దగంజాం ప్రాంతానికి ఏడు కిలోమీటర్ల దూరంలోనే రైల్వే ట్రాక్ కూడా ఉండడం కూడా కలిసొస్తుంది అంటున్నారు. ఈ హైవే నిర్మాణంతో తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ మధ్య రవాణా మరింత సులువు అవుతుంది.
చీరాల ప్రాంతంలో వాడరేవు ఉండడంతో పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. వాణిజ్య వ్యాపారాలు సైతం హైవే నిర్మాణంతో మరింత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఈ హైవే హైదరాబాద్ (అద్దంకి- నార్కెట్పల్లి)కు కూడా కనెక్ట్ అవుతోంది.
నేషనల్ హైవే 167-A విస్తరణ ప్రాజెక్ట్ వాడరేవు-పిడుగురాళ్ల మధ్య నాలుగు లేన్లుగా చేపట్టారు. 85 కిలోమీటర్లకుపైగా ఈ జాతీయ రహదారి నిర్మాణం కోసం రూ.1,064.24 కోట్ల వ్యయం అవుతోందని అంచనా . నెకరికల్లు దగ్గర అద్దంకి-నార్కెట్పల్లి రోడ్, చీరాల దగ్గర నేషనల్ హైవే 216, చిలకలూరిపేట దగ్గర నేషనల్ హైవే 16 కి అనుసంధానం చేస్తున్నారు.
వాడరేవు నుంచి ఈపురుపాలెం వరకు 18 కిలో మీటర్లు కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టారు. పర్చూరు, * తిమ్మరాజుపాలెం, చిలకలూరిపేట దగ్గర బైపాస్లు ఉంటాయి. ఈ హైవేతో చీరాల నుంచి సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహంతో పాటుగా బాపట్ల-ఓడరేవు మధ్య బీచ్ టూరిజం అభివృద్ధి చెందుతుంది. కోస్తా జిల్లాలకు కనెక్టివిటీ.. ట్రాఫిక్ తగ్గించడానికి, కనెక్టివిటీ మెరుగుపర్చడానికి బైపాస్లు, సర్వీస్ రోడ్లు, బ్రిడ్జిలు ఉన్నాయి.
మరోవైపు ఈ 167ఏ వాడరేవు-పిడుగురాళ్ల హైవేలో కీలకమైన నరసరావుపేట బైపాస్ సర్వే మొదలైంది. భూసేకరణ కూడా నరసరావుపేట బైపాస్ మినహా మిగతా అన్నిచోట్లా పూర్తికాగా.. అలైన్మెంట్ మార్చాలని కొందరు రైతులు కోరారు. కానీ జాతీయ రహదారి అథారిటీ అధికారులు మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉన్నారు. డీపీఆర్కు అనుగుణంగానే కేసానుపల్లి, జొన్నలగడ్డ, రావిపాడు మీదుగానే బైపాస్ నిర్మించేలా ముందుకెళ్తున్నారు. ఈ మేరకు సర్వే పనులు సాగుతున్నాయి.