ఏపీలో వైసీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన 13 కేసుల్లో 9 కేసులకు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. రెండు వారాల పాటు రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసిన కోర్టు.. ఈ కేసులపై అఫిడవిట్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.
- Advertisement with us -