తమిళ పొన్ను రెజీనా కాసాండ్రా 1990లో చెన్నైలో జన్మించింది. ఏడేళ్ల వయసులోనే స్ప్లాష్ అనే చిన్నపిల్లల చానెల్ కు యాంకరింగ్ చేసింది. తెలుగు, తమిళ,కన్నడ సినిమాల్లో నటించిన రెజీనా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. మూకుత్తి అమ్మన్ 2 సినిమా ఫంక్షన్లో… రెజీనా వయ్యారాలు పోతూ చీరలో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
2012లో శివ మనస్సులో శృతి అనే సినిమాతో తెలుగు చిత్రసీమలోకి ఎంటర్ అయిన రెజీనా వరుస ఆఫర్లతో గుర్తింపు పొందింది.
మద్రాసు యూనివర్శిటీ నుంచి సైకాలజీలో డిగ్రీ చేసిన రెజీనా…సామాజిక సేవా కార్యక్రమాల్లోను పాల్గొంటుంది.
బోల్డ్గా మాట్లాడే రెజీనా గతంలో చేసిన మ్యాగీ కామెంట్ సంచలనమైంది. మగాళ్లు మ్యాగీ లాంటి వాళ్లు.. రెండే రెండు నిమిషాలు అంటూ కుర్రాళ్లకు పిచ్చెక్కిపోయే కామెంట్స్ చేసింది.
ఓ సినిమా ఫంక్లన్లో యాంకర్ ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది అమ్మడు. తనకు చాలా రిలేషన్ షిప్స్ ఉన్నాయని, కంటిన్యూగా డేటింగ్స్ చేస్తూనే ఉంటానని చెప్పేసింది.
డెమో క్రటిక్ సంఘ పేరుతో నడుపుతున్న స్వచ్ఛంద సంస్థలో రెజీనా సభ్యురాలు. సంస్థ తరపున పార్లమెంటు కూడా సందర్శించింది.
మెగా హీరోల సరసన నటించి తెలుగులో క్రేజీగా మారింది. కొత్త జంటలో అల్లు శిరీష్తో, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ సరసన పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలు చేసింది.
ప్రస్తుతం తమిళంలోనే వరుస ఆఫర్స్ అందుకుంటున్న రెజీనా.. ప్రస్తుతం నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘మూకుత్తి అమ్మన్ 2’ లో కీలక పాత్ర పోషించనుంది.
ప్రస్తుతం తమిళ సినిమాలతో రెజీనా బిజీగా ఉంది. హిందీలో కూడా ఓ సినిమా చేస్తోంది. సినిమాలు, సామాజిక కార్యక్రమాలతో రెజీనా కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది.
courtesy : instagram