అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువతి మృతి చెందారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం… తెనాలికి చెందిన వ్యాపారి గణేశ్, రమాదేవి దంపతుల కుమార్తె నాగశ్రీవందన పరిమళ (26) 2022లో ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్లారు. టెన్నెసీ రాష్ట్రంలో ఆమె చదువుతున్నారు. అయితే ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై దుర్మరణం చెందారు. పరిమళ మృతదేహాన్ని తెనాలికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
- Advertisement with us -