32.7 C
Hyderabad
Monday, May 25, 2026

Live Video

spot_img

ఏపీలో పురుష పొదుపు సంఘాలు

మహిళా సంక్షేమం కోసం తెలంగాణ, ఏపీతో పాటు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రారంభించింది. వారికి స్వయం ఉపాధి కల్పించడంతో పాటు.. ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశ్యంతో పొదుపు సంఘాలకు రుణాలను మంజూరు చేస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు డ్వాక్రా గ్రూపులు ఉన్నట్లుగానే ఏపీలో పురుష కార్మికులకు కూడా పొదుపు సంఘాలు ఏర్పాటు కానున్నాయి. వీరికి కూడా రుణాలను మంజూరు చేయనున్నారు.1982లో ప్రారంభించిన డ్వాక్రా పథకం గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంత మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతో తోడ్పాటును అందిస్తోంది. ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడమే కాకుండా.. స్వయం ఉపాధి అవకాశాలను ఈ పథకం కల్పిస్తుంది. ఈ పథకంలో మహిళలకు చాలా తక్కువ వడ్డీతో రుణాలను మంజూరు చేస్తారు.

దీని మాదిరిగానే పట్టణాల్లో అసంఘటిత రంగంలో పనిచేసే పురుషుల కోసం స్వయం శక్తి బృందాలు ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం రుణాలను అందించనుంది. దీనిలో భాగంగానే పురుషుల కోసం ప్రత్యేకంగా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నంలో ఇప్పటికే పైలెట్ ప్రాజెక్ట్ కింద 2,841 గ్రూపులను ఏర్పాటు చేసినట్లు మెప్మా అధికారులు పేర్కొన్నారు. NULM (నేషనల్ అర్బన్ లైవ్‌లీవుడ్ మిషన్) 2.0 కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం.. మహిళలు ఎలాగైతే స్వయం సహాయక గ్రూపులుగా ఏర్పడి రుణాలు పొందుతున్నారో.. అలానే పురుషులకు కూడా రుణాలను అందించేందుకు తోడ్పాటు అందిస్తామని తెలిపారు.

అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ఈ పథకం రూపొందించినట్లు మెప్మా అధికారులు తెలిపారు. డ్వాక్రా సంఘంలోని మహిళలు గ్రూపుగా ఏర్పడిన విధంగా.. పురుషులు కూడా కనీసం 5 మందితో గ్రూప్ ఏర్పాటు చేసుకోవచ్చు. గరిష్టంగా ఎంత మందైనా ఈ గ్రూపులో చేరవచ్చు. ఇలా ఒక గ్రూపుగా ఏర్పడిన వారికి మాత్రమే బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తాయి. దీనిని వాయిదాల రూపంలో బ్యాంకులకు తిరిగి చెల్లించవచ్చు. ప్రతి ఒక్కరూ కనీసం రూ.100 పొదుపు చేయాల్సి ఉంటుంది.

ఉదాహరణకు ఐదుగురు సభ్యులున్న గ్రూపులో రూ.500 పొదుపుతో మూడు నెలల పాటు క్రమం తప్పకుండా పొదుపు చేస్తే, రివాల్వింగ్ ఫండ్ కింద రూ. 25 వేలు మంజూరు చేస్తారు. వీటిని ఆరు నెలల పాటు క్రమంతో తప్పకుండా పొదుపు చేస్తే, ఫస్ట్ లింకేజీ కింద బ్యాంకులు ఆరు రెట్లు రుణం అందిస్తాయి. రుణాలు అందుకున్న పురుషులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డీని మాఫీ చేస్తాయి. వీటికి భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులతో పాటు.. రిక్షా కూలీలు, తోపుడు బండ్లు నడిపే వారు, గిగ్ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, కేర్‌ వర్కర్స్‌ అర్హులుగా ఉంటారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com