ప్రధానమంత్రి నరేంద్రమోడీ పారిస్లో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఫుల్ బిజీగా ఉన్నారనే చెప్పాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్లో పాల్గొనేందుకు పారిస్ వెళ్లిన ప్రధాని కీలకమైన దేశాధినేతలను కలుస్తున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్,అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో ముచ్చటించారు. పారిస్లో రెండు రోజుల పాటు ప్రధాని పర్యటన కొనసాగనుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్తో కలిసి అధ్యక్షత వహిస్తున్నారు మోదీ. భారత్, ఈయూ దేశాలు డెవలప్మెంట్తో పాటు ఏఐని ఎలా ఉపయోగించుకోవాలో ఈ సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాదు ఏఐ విషయంలో జాయింట్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోనున్నారు.
ఈ మధ్య డీప్సీక్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదనే చెప్పాలి. అలాంటి సమయంలో ఈ భేటీ జరుగుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
పారిస్లో మోడీకి అపూర్వ స్వాగతం లభించింది. అక్కడి ఇండియన్ కమ్యూనిటీ మోడీకి ఘనస్వాగతం లికారు. ఇక ఈ పర్యటనలో ఇండియా-ఫ్రాన్స్ సీఈఓ ఫోరమ్తో మోదీ భేటీ కానున్నారు. అంతేకాదు భారత్-ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక చర్చలు కూడా జరగనున్నాయి.