హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమాన ప్రమాదం తప్పింది. ముంబై నుంచి హైదరాబాద్ మీదుగా ఈరోజు విశాఖ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్ ఫ్లైట్ ను అత్యవసరంగా దించేశారు. షటిల్ లో బోర్డై ఉన్న 144 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఇటీవల వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఆందోళన రేకెత్తించింది.