-
ఎనిమిది జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ
తెలంగాణలో రాబోయే మూడురోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆగ్నేయ మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాల్లో విదర్భ మీదుగా తెలంగాణ మధ్య ప్రాంతాల వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో రాబోయే మూడురోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆగ్నేయ మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాల్లో విదర్భ మీదుగా తెలంగాణ మధ్య ప్రాంతాల వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. కోస్తాంధ్ర, యానాం మధ్య ప్రాంతాలు, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటున సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం చెప్పింది. సోమవారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.