కాంగ్రెస్పార్టీ అగ్రనేత రాహుల్గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు. ఎక్స్లో ఆసక్తికర ట్వీట్ చేశారు. బీజేపీని మరోసారి గెలిపించిన రాహుల్ గాంధీకి కంగ్రాట్స్.. అంటూ ఎక్స్లో కేటీఆర్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్కు గతంలో రాహుల్ గాంధీ గురించి ఆయన మాట్లాడిన వీడియోను కూడా అటాచ్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ ఇంకా పూర్తిగా రాకముందే.. ట్రెండ్ బీజేపీ వైపు మొగ్గు చూపగానే కేటీఆర్ ఎక్స్లో ఈ పోస్ట్ చేశారు.
అయితే, పోస్ట్లో తాను ట్యాగ్ చేసిన వీడియో కూడా ఆసక్తికరంగానే ఉంది. గతంలో ఇండియా టుడే ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడిన వీడియో అది. బీజేపీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్గాంధీయే అని ఆ వీడియోలో కేటీఆర్ సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీకి బీజేపీని నిలువరించే సత్తా లేదని, ఆయనకు ఆ సత్తా ఉంటే.. ఉత్తర ప్రదేశ్కో, గుజరాత్కో, బీహార్కో వెళ్లి ఆ పార్టీతో కొట్లాడాలి గానీ, తెలంగాణకు వచ్చి బీజేపీని సమర్థంగా ఎదుర్కొనే నేతలతోనే పోరాడతానంటారని, అందుకే దేశంలో మోదీకి ఉన్న అతిపెద్ద కార్యకర్త రాహుల్ గాంధీయే.. అని కేటీఆర్ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.
ఢిల్లీ అసంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో చేసిన ఈ ఎక్స్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎక్స్లో ట్రెండ్ అవుతోంది.