35 C
Hyderabad
Friday, April 24, 2026

Live Video

spot_img

ఈ రేస్ కేసులో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్

ఫార్ములా ఈ రేస్ కేసులో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ స్టేట్మెంట్ ని ఏసీబీ రికార్డు చేసింది. ఫార్మాలా ఈ రేసు లో ఎటువంటి జీఓ లేకుండా కంపెనీకి 50 కోట్లు చెల్లించినట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపిల్ సెక్రటరీ హోదాలో దానకిషోర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కీలక పాత్రధారిగా ఉన్న కేటీఆర్ విచారణకు గవర్నర్ జిష్ణు కుమార్ వర్మ అనుమతించిన నేపధ్యంలో ఏసీబీ తన విచారణను ప్రారంభించింది. ఈ క్రమంలో ఫిర్యాదు దారుడైన ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ని మంగళవారం ఏసీబీ విచారించింది. దానకిషోర్ ని దాదాపు ఏడు గంటల పాటు విచారించిన ఏబీ ఆయన స్టేట్మెంట్ ను రికార్డు చేసింది. దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఫార్ములా ఈ రేసు కేసులో పాత్రధారులైన కేటీఆర్, ఐఎఎస్ అర్వింద్ కుమార్ లకు ఏసీబీ సమన్లు ఇవ్వనున్నట్లు సమాచారం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com