వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఎం.ఏ.ఆర్ గార్డెన్స్లో జరిగిన షటోకాన్ జపాన్ కరాటే డు ఇండియా హంబ్ నేషనల్ ఇన్విటేషన్ కరాటే 2024-25 టోర్నమెంట్లో గోదావరిఖనికి చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ఈ టోర్నమెంట్లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుండి విద్యార్థిని విద్యార్థులు పాల్గొనగా.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన జపాన్ షిటోరియో కరాటే స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ప్రత్యేకమైన ప్రతిభ కనబరిచి కటాస్, కుమితి విభాగంలో బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారు. బ్లాక్ బెల్ట్ కటాస్ విభాగంలో హేమలత మహజి, స్నేహ సుల్తానా, ఎం ముక్తిశ్రీ బంగారు పతకాలు సాధించారు. బ్లాక్ బెల్ట్ కుమితి విభాగంలో హేమలత మహజి, ఎం ముక్తిశ్రీ బంగారు పతకాలు సాధించగా.. సునీహసుల్తానా వెండి పతకం సాధించింది. అలాగే, కలర్ బెల్స్ కటాస్ విభాగంలో శివాష్ష్, ఎం కార్తికేయన్, పి మోహిత్ బంగారు పతకాలు సాధించగా.. రోహన్, అక్షిత్ రెడ్డి, కార్తిక, శ్రీ వర్షిని, కీర్తి మహాజీ, సిహెచ్ అశ్విన్, ఏ మనస్విని, సంయుక్త, టి పవన్ కుమార్, రిషి వరుణ్, ఎండి సుహాన్ , పి శ్రీ రాజ్ వెండి పతకాలు సాధించారు. కలర్ బెల్స్ కుమితి విభాగంలో కీర్తి మహజి, సంయుక్త, ఏ మనస్విని బంగారు పతకాలు సాధించగా.. రోహన్, కార్తికేయన్ వెండి పతకాలు సాధించారు.
ఈ ఇన్విటేషన్ నేషనల్ కరాటే టోర్నమెంట్ లో పతకాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులను మరియు కోచ్ కరాటే శ్రీనివాస్ ను జపాన్ షిటోరియో కరాటే స్కూల్ ప్రెసిడెంట్ తగరపు శంకర్, జపాన్ షిటోరియో కరాటే స్కూల్ సెక్రెటరీ ఎం రమేష్, సీనియర్ ఇన్స్ట్రక్టర్స్ ఎస్ శ్రీనివాస్, శ్రావణ్ కుమార్ పటేల్, నిదిష్ కుమార్, రోహిత్ కుమార్, సంజన, శుభశ్రీ, అభిజ్ఞ,స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ గణేష్ రాజ్ తదితరులు ప్రత్యేకంగా అభినందించారు.