బిచ్చగాళ్లపై సానుభూతితో ఎవరైనా డబ్బులు దానం చేస్తే ఇక నుంచి కేసు నమోదవుతుంది. యాచకులకు ఎవరైనా బిచ్చం వేస్తుండగా పోలీసుల కంట పడితే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేస్తారు. యాచక వృత్తిని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా దేశంలో యాచకులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వశాఖ పైలట్ ప్రాజెక్టు చేపట్టింది.
పైలట్ ప్రాజెక్టులో భాగంగా మొదట ఇండోర్ ఆ తర్వాత ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతదితర పది నగరాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. 2025 జనవరి 1వ తేదీ నుంచి కొత్త నిబంధన అమలులోకి రానుంది. యాచకులను పునరావాస కేంద్రాలకు తరలించే ఆంశంలో నగర పౌరులు పోలీసులకు, ప్రభుత్వానికి సహకరించాలని కేంద్రం సూచించింది.