24.2 C
Hyderabad
Monday, October 20, 2025

Live Video

spot_img

పాకిస్థాన్ కు ఐఎంఎఫ్ చిక్కులు

భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్, పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌పై కచ్చితమైన దాడులు జరపడంతో, భారత్‌–పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ పాకిస్తాన్‌పై కొత్త ఆర్థిక షరతులను విధించి, ఆ దేశ ఆర్థిక విధానాలపై తీవ్ర దృష్టి సారించింది. మొత్తం 50 షరతులతో, ఐఎంఎఫ్  కఠినమైన ఆర్థిక సంస్కరణ షరతులు పాకిస్తాన్‌ ప్రభుత్వాన్ని ఒత్తిడిలోకి నెట్టాయి.

ఈ కొత్త షరతులు, పాకిస్తాన్‌ రక్షణ బడ్జెట్‌ పెరుగుదల, ఆర్థిక అస్థిరతల నడుమ వచ్చాయి. దీనితో ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం మరింత లోనవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఐఎంఎఫ్ ఇటీవల పాకిస్తాన్‌కు 7 బిలియన్‌ డాలర్ల ఎక్స్‌టెండెడ్‌ ఫండ్‌ ఫెసిలిటీ  కింద 1.023 బిలియన్‌ డాలర్లు రెండవ విడత విడుదల చేసింది. ఈ నిధులతో పాటు 11 కొత్త షరతులను విధించింది. దీంతో మొత్తం షరతుల సంఖ్య 50కి చేరింది.

ఈ షరతులు పాకిస్తాన్‌ ఆర్థిక విధానాలను కఠినంగా నియంత్రించడమే కాకుండా, దేశ బడ్జెట్, పన్ను సంస్కరణలు, మరియు రక్షణ ఖర్చులపై ప్రభావం చూపుతాయి. IMF సిబ్బంది నివేదికలో,
భారత్‌–పాకిస్తాన్‌ ఉద్రిక్తతలు ఈ సంస్కరణ లక్ష్యాలను ప్రమాదంలోకి నెట్టవచ్చని హెచ్చరించింది, ఇది పాకిస్తాన్‌ ఆర్థిక స్థిరత్వానికి కొత్త సవాళ్లను తెచ్చిపెడుతుంది. పాకిస్తాన్‌ 2025–26 ఆర్థిక సంవత్సరానికి రక్షణ బడ్జెట్‌ను రూ.2.414 ట్రిలియన్లుగా నిర్ణయించింది.

ఇది గత సంవత్సరం కంటే 12% (రూ.252 బిలియన్లు) అధికం. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారత్‌–పాక్‌ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, పాకిస్తాన్‌ ప్రభుత్వం రక్షణ బడ్జెట్‌ను రూ.2.5 ట్రిలియన్లకుపైగా పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది 18% పెరుగుదలను సూచిస్తుంది. ఈ రక్షణ ఖర్చుల పెరుగుదల IMF ఆర్థిక సంస్కరణ లక్ష్యాలకు విరుద్ధంగా ఉందని, ఇది ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

2026 బడ్జెట్‌ ఆమోదం: జూన్‌ 2025 నాటికి, పాకిస్తాన్‌ పార్లమెంట్‌ రూ.17.6 ట్రిలియన్ల బడ్జెట్‌ను, IMF లక్ష్యాలకు అనుగుణంగా ఆమోదించాలి. ఈ బడ్జెట్‌ 1.6% ఎఈ్క ప్రాథమిక బడ్జెట్‌ సర్ప్లస్‌ను సాధించాలి. దీనికి రూ.2 ట్రిలియన్ల అదనపు ఆదాయం అవసరం: జూన్‌ 2025 నాటికి, నాలుగు రాష్ట్రాలు కొత్త వ్యవసాయ ఆదాయపు పన్ను చట్టాలను అమలు చేయాలి. దీనికోసం రిజిస్ట్రేషన్, పన్ను వసూలు, ప్రచార కార్యక్రమాల కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ఈ చర్య వ్యవసాయరంగంలో పన్ను వసూళ్లను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది చారిత్రాత్మకంగా పన్ను ఆదాయంలో తక్కువ వాటాను కలిగి ఉంది.: ఫిబ్రవరి 15, 2026 నాటికి గ్యాస్‌ చార్జీలను సవరించాలి, మే 2026 నాటికి ఈ ఆర్డినెన్స్‌ను శాశ్వత చట్టంగా మార్చాలి. ఇది ఇంధన రంగంలో సబ్సిడీలను తగ్గించి, ఆర్థిక భారాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది.

విద్యుత్‌ సర్‌చార్జ్‌ : విద్యుత్‌ బిల్లులపై అధిక రుణ సేవా సర్‌చార్జ్‌లను విధించాలి, దీనితో విద్యుత్‌ రంగంలో సర్క్యులర్‌ డెట్‌ను తగ్గించేందుకు ప్రయత్నించాలి. ఐఎంఎఫ్ మరియు ప్రపంచ బ్యాంక్‌ పాకిస్తాన్‌ యొక్క ఇంధన విధానాలను సర్క్యులర్‌ డెట్‌కు ప్రధాన కారణంగా గుర్తించాయి.

ఇతర సంస్కరణలు ప్రత్యేక జోన్‌ రాయితీల తొలగింపు: 2035 నాటికి స్పెషల్‌ టెక్నాలజీ జోన్‌లు, ఇండస్ట్రియల్‌ పార్క్‌లకు ఇచ్చే రాయితీలను పూర్తిగా తొలగించాలి, దీనికోసం 2025 చివరి నాటికి ఒక రోడ్‌మ్యాప్‌ సమర్పించాలి.

వాడిన కార్ల దిగుమతి: జూలై 2025 నాటికి, ఐదు సంవత్సరాలలోపు వాడిన కార్ల దిగుమతిని అనుమతించే చట్టాన్ని పార్లమెంట్‌కు సమర్పించాలి, ఇది ప్రస్తుత మూడు సంవత్సరాల పరిమితిని సడలించడం ద్వారా వినియోగదారులకు మరిన్ని ఎంపికలను అందిస్తుంది.

గవర్నెన్స్‌ సంస్కరణలు: IMF గవర్నెన్స్‌ డయాగ్నొస్టిక్‌ అసెస్‌మెంట్‌ ఆధారంగా, అవినీతి బహిర్గతాలను గుర్తించి, సంస్కరణల కోసం ఒక గవర్నెన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ను ప్రచురించాలి. అదనంగా, 2027 తర్వాత ఆర్థిక రంగ

నియంత్రణ కోసం ఒక ప్రణాళిక రూపొందించి, 2028 నుంచి సంస్థాగత వాతావరణాన్ని బలోపేతం చేయాలి. రక్షణ ఖర్చులు, ఆర్థిక అస్థిరత
పాకిస్తాన్‌ GDP కేవలం 236 బిలియన్‌ డాలర్లు్ల కాగా, రక్షణ రంగానికి 7 బిలియన్‌ డాలర్లకుపైఆ కేటాయించడం ఆర్థిక సంక్షోభాన్ని మరింత పెంచుతోంది. ఐఎంఎఫ్ నిధులు ఆర్థిక స్థిరత్వం కోసం ఉద్దేశించినప్పటికీ,

వీటిని రక్షణ ఖర్చులకు మళ్లించే అవకాశం ఉందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. భారత్, IMF బోర్డ్‌ సమావేశంలో ఈ నిధుల విడుదలకు వ్యతిరేకంగా ఓటు వేయకుండా నిష్క్రియంగా ఉండటం, పాకిస్తాన్‌ గత

రికార్డు, ఉగ్రవాదానికి నిధుల సాధ్యతపై ఆందోళనలను వ్యక్తం చేసిందిపాకిస్తాన్‌ వేగంగా పెరుగుతున్న జనాభా విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై భారీ ఒత్తిడిని కలిగిస్తోంది, దీనితో ఆర్థిక సంక్షోభం మరింత

తీవ్రమవుతోంది. షరతులు, ముఖ్యంగా ఇంధన సబ్సిడీల తొలగింపు, పన్ను వసూళ్ల పెంపు, ద్రవ్యోల్బణాన్ని పెంచి, ప్రజలలో అసంతృప్తిని కలిగించే అవకాశం ఉంది. ఈ షరతులను అమలు చేయడంలో విఫలమైతే,

IMF నిధుల విడుదల ఆగిపోవచ్చు, దీనితో పాకిస్తాన్‌ ఆర్థిక పతనం అంచులకు చేరుకునే ప్రమాదం ఉంది.మే 7, 2025న భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్, ఏప్రిల్‌ 22న పహల్గామ్‌లో 26 మంది

మరణించిన ఉగ్రదాడికి ప్రతీకారంగా జరిగింది. ఈ దాడుల తర్వాత, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, IMF నిధులు పాకిస్తాన్‌ ఉగ్రవాద మౌలిక సదుపాయాలకు పరోక్షంగా సహాయపడతాయని హెచ్చరించారు.

IMF సిబ్బ – భారత్‌–పాకిస్తాన్‌ ఉద్రిక్తతలు ఆర్థిక సంస్కరణలను దెబ్బతీస్తాయని, ఈ ఉద్రిక్తతలు కొనసాగితే పాకిస్తాన్‌ ఆర్థిక లక్ష్యాలు ప్రమాదంలో పడతాయని తన నివేదికలో పేర్కొంది.ఐఎంఎఫ్ నిధులు పాకిస్తాన్‌

ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి, 2025 చివరి నాటికి 2.1% GDP లక్ష్యాన్ని సాధించేందుకు దోహదపడుతున్నాయి. అయితే, కొత్త షరతులు, ముఖ్యంగా ఇంధన సబ్సిడీల

తొలగింపు, పన్ను పెంపు, ద్రవ్యోల్బణాన్ని పెంచి, ప్రజల జీవన వ్యయాన్ని పెంచుతాయి. ఈ షరతులను అమలు చేయడంలో విఫలమైతే, IMF నిధులు నిలిపివేయబడవచ్చు, దీనితో పాకిస్తాన్‌ ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమవుతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com