ఎంతో కష్టపడి చదివి ఐపీఎస్ అయి.. ఎస్పీగా జాయిన్ అవ్వడానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో మరణించిన యంగ్ ఐపీఎస్. మధ్యప్రదేశ్కు చెందిన హర్ష్ బర్దన్ (26) 2023 సివిల్స్లో కర్ణాటక క్యాడర్ ఐపీఎస్గా ఎంపికయ్యారు. ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్న హర్ష్కు తొలి పోస్టింగ్ హసన్ జిల్లాలో వచ్చింది.
మధ్యప్రదేశ్ కు చెందిన 26 ఏళ్ల యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ ఎంతో కష్టపడి చదివి ఐపీఎస్ అయి.. కర్ణాటకలోని హోలెనరసిపురలో ప్రొబేషనరీ ఎస్పీగా ఎంపికయ్యాడు. నిన్న పోస్టింగ్ కోసం హోలెనరసిపురకు వెళ్తుండగా, హసన్-మైసూరు రోడ్డుపై టైర్ పేలి కారు పక్కనే ఉన్న ఇంటిని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో హర్ష్ బర్ధన్, ఆయన కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు.