సుప్రీంకోర్టు ప్రాంగణంలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోర్టు నెంబర్ 11, 12ల మధ్య ఉన్న వెయిటింగ్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన సుప్రీంకోర్టు సెక్యూరిటీ, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. విద్యుదాఘాతం కారణంగా ప్రమాదం జరిగినట్లు నిర్ధరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని సుప్రీంకోర్టు సిబ్బంది ప్రకటించారు.