మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళగిరి నివాసం వద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నిప్పు మంటలు చెలరేగటం కలకలం రేపింది. ఈ ఘటన రాత్రి జరిగిందని ప్రాథమిక సమాచారం. భద్రతా సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. ప్రహారి గోడ సమీపంలో అంటుకున్న మంటలతో ఏం జరిగింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జగన్ నివాసం వద్ద పూలతోటకు నిప్పు పెట్టిన దుండగుల వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి నివాసం వద్ద తగినంత భద్రత లేకపోవడం వల్లే దుండగులు బరితెెగించారని వైఎస్ఆర్ సిపి నేతలు మండిపడుతున్నారు.