హైదరాబాద్ మాదాపూర్ పరిధిలో బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అయ్యప్ప సొసైటీ 100 ఫీట్స్ రోడ్డుపై వేగంగా వచ్చిన బుల్లెట్బైక్ మధ్యలో డివైడర్ను ఢీకొట్టింది. దీంతో, బైక్పై ఉన్న ఇద్దరూ ఎగిరి రోడ్డుమీద పడిపోయారు. బుల్లెట్బైక్ కిందపడ్డాక కూడా అదే వేగంతో దాదాపు వంద మీటర్ల దూరం దూసుకెళ్లింది. బైక్ నడుపుతున్నవ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు చెబుతున్నారు. మృతులను బోరబండకు చెందిన రఘుబాబు, ఆకాంక్ష్గా గుర్తించారు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.