29.7 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

శ్రీవారి సేవలో ప్రధాన న్యాయమూర్తి

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సోమవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ స్వామివారి దర్శనం కోసం కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చారు. తిరుమలకు వచ్చిన చీఫ్‌ జస్టిస్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు అదనపు ఈవో సీ.హెచ్‌.వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికారు. దగ్గరుండి స్వామివారి దర్శనం చేయించారు.

చీఫ్ జస్టిస్‌ కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్న తర్వాత రంగ నాయకుల మండపం వద్ద వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి.. చీఫ్ జస్టిస్‌కు స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం, క్యాలెండర్‌ను బహూకరించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com