భద్రాచలంలో శ్రీ సీతారామ చంద్ర స్వామి కల్యాణ మహోత్సవానికి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో సీతా రాముల కల్యాణం కన్నులారా వీక్షించేందుకు తరలివచ్చారు.
ఇక, ఈ వేడుకలను తిలకించేందుకు ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అలాగే, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దంపతులు, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దంపతులు, తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖ తదితరులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని సంపూర్ణంగా తిలకించారు. ఆ ప్రముఖులకు సంబంధించిన దృశ్యాలు భాస్కర న్యూస్ పాఠకుల కోసం ప్రత్యేకం…