28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

Live Video

spot_img

రాహుల్ గాంధీ సంభల్ యాత్రకు బ్రేక్…బిజెపి విమర్శలు

దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్ నెలకొంది. ఉత్తరప్రదేశ్‌ లోని సంభల్‌ లో న్యాయస్థానం ఆదేశాల మేరకు మసీదులో సర్వే చేస్తుండగా అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా ఈ రోజు(బుధవారం) సంభల్‌కు బయల్దేరారు.

దీంతో పోలీసులు ఢిల్లీ నలుమూలలా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ఢిల్లీ – సంభల్‌ మార్గంలోని వివిధ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. దీంతో ఢిల్లీ – మీరట్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘాజీపూర్‌ సరిహద్దులో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

శాంతిభద్రతల సమస్య వస్తుందనే కారణంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను సంభల్ వెళ్లకుండా ఆపేశారు. యూపి రాష్ట్రంలోకి రాగానే నోయిడా దగ్గర ఇద్దరు నేతలను ముందుకు వెళ్లకుండా ఆపేశారు. ఈ తరుణంలో పోలీసులతో కాంగ్రెస్ శ్రేణులు వాగ్వాదానికి దిగాయి.

బంగ్లాదేశ్లో హిందువులపై అరాచకాలు జరుగుతుంటే నోరు మొదపని రాహూల్ గాంధీ సంభల్ విషయంలో రాజకీయ లబ్ది కోసం యత్నిస్తున్నారని బిజెపి సీనియర్ నేత, కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ విమర్శించారు.

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో ఇటీవల జరిగిన హింసాకాండపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సహా లోక్‌సభలోని దాదాపు మొత్తం విపక్షాలు మంగళవారం సభ నుండి కొద్దిసేపు వాకౌట్ చేశాయి.

ప్రశ్నోత్తరాల సమయంలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నాయకుడు అఖిలేష్ యాదవ్ తన సీటుపై నుంచి లేచి సమస్య లేవనెత్తారు, ఈ అంశంపై మాట్లాడేందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతి కోరారు. “ఇది చాలా తీవ్రమైన విషయం. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు” అని యాదవ్ చెప్పడం వినిపించింది.

జీరో అవర్‌లో సభ్యులు సమస్యను లేవనెత్తవచ్చని స్పీకర్ చెప్పడంతో యాదవ్ మరియు అతని పార్టీ సహచరులు నిరసనగా వాకౌట్ చేయడం ప్రారంభించారు. ఇంతలో కొందరు ఎస్పీ సభ్యులు నినాదాలు చేస్తూ వెల్‌ వద్దకు చేరుకున్నారు.

మొఘల్‌ కాలం నాటి షాహి జామా మసీదులో సర్వే నేపథ్యంలో నవంబర్ 24న అక్కడ హింస చెలరేగింది. రాళ్లు రువ్వి, వాహనాలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ హింసాకాండలో ఐదుగురు వ్యక్తులు మరణించగా పోలీసులతో సహా 30 మందికిపైగా గాయపడ్డారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com