ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్న భట్టి విక్రమార్క.. ఆ తర్వాత ఓ బాధితుడి కుటుంబాన్ని కూడా పరామర్శించారు.
ఇటీవల ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో మృతి చెందిన వ్యవసాయ కూలీ యార్లగడ్డ వరమ్మ కుటుంబాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరామర్శించారు. మృతురాలి చిత్రపటం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివాళులర్పించారు. ఈ ప్రమాదంలో వరమ్మ చనిపోవడంతో పాటు.. ఆ ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వాళ్లను కూడా కలిశారు డిప్యూటీ సీఎం. క్షతగాత్రులను అడిగి ప్రమాదానికి సంబంధించిన వివరాలు, తదనంతర పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఇటీవల ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో మృతి చెందిన వ్యవసాయ కూలీ యార్లగడ్డ వరమ్మ కుటుంబాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరామర్శించారు. మృతురాలి చిత్రపటం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివాళులర్పించారు. ఈ ప్రమాదంలో వరమ్మ చనిపోవడంతో పాటు.. ఆ ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వాళ్లను కూడా కలిశారు డిప్యూటీ సీఎం. క్షతగాత్రులను అడిగి ప్రమాదానికి సంబంధించిన వివరాలు, తదనంతర పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.