పుష్ప2 సినిమా చూసేందుకు వెళ్లి ఓ మహిళ చనిపోయింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసుల కేసు నమోదు చేశారు. సెక్షన్ 105,118 BNS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు.
అల్లు అర్జున్ థియేటర్ కు వస్తున్న సందర్భంలో భద్రత విషయంలో సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని ఆరోపణలు వచ్చాయి. అల్లు అర్జున్ వస్తున్న విషయం పోలీసులకు సరైన సమయంలో చెప్పకుండా బాధ్యతరాహిత్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.