కేరళ, తమిళనాడు తీరాలకు కల్లక్కడల్ తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది.
ఈ రోజు (బుధవారం)జనవరి 15న రాత్రి అకస్మాత్తుగా సముద్రంలో వచ్చే ఉప్పెన కారణంగా బలమైన అలలు ఎగసిపడే అవకాశం ఉందని సమాచారం.
ఈ రోజు రాత్రి 11.30 గంటల వరక తీరంలోని వివిధ ప్రాంతాల్లో 0.5 మీ. నుంచి 1 మీటర్ల మేర అలల తాకిడి ఉంటుందని, సముద్ర ఉప్పెన ముప్పు పొంచి ఉందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఐఎన్సీవోఐఎస్) హెచ్చరించింది.