తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు శనివారం మధిర నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభత్వం నిర్ణయించిన గురుకుల పాఠశాలల పర్యటన కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపనలు చేస్తారు. అలాగే పార్టీ కార్యకర్తలను కలుస్తారు.
👉 ఉదయం 11:40 గంటల నుంచి మధ్యాహ్నం 02:20 గంటల వరకు మధిర నియోజకవర్గం, బోనకల్ లోని బీసీ గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడ పరిస్థితులను తెలుసుకొని అదేవిధంగా విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారు.
👉 ఉదయం 9:20 గంటలకు చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చేరుకొని ఇటీవల పితృ వియోగం పొందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంబటి వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శిస్తారు.
👉 ఉదయం 11 గంటలకు బోనకల్ మండలం ముసికుంట్ల గ్రామానికి చేరుకొని ఎన్ఆర్ఈజీఎస్ రోడ్డును ప్రారంభిస్తారు.
👉 మధ్యాహ్నం 2:30 గంటలకు 19.45 లక్షల రూపాయలతో నిర్మాణం చేయనున్న ఎన్ఆర్ఈజీఎస్ రోడ్డుకు శాంతినిలయం వద్ద శంకుస్థాపన చేస్తారు.
👉 మధ్యాహ్నం 3 గంటలకు రావినూతల గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు.
👉 మధ్యాహ్నం 3:30 గంటలకు గోవిందపురం గ్రామానికి చేరుకొని ఐదు రోడ్లకు శంకుస్థాపన చేస్తారు.
👉 సాయంత్రం 5:15 గంటలకు జానకిపురం గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు.
👉 సాయంత్రం 6 గంటలకు రాపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం ఎన్ఆర్ఈజీఎస్ రోడ్లకు శంకుస్థాపన చేస్తారు.
👉 సాయంత్రం 6:45 గంటలకు రంపిమల్ల గ్రామంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు.