ఛత్తీస్గఢ్లోని గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధి అటవీప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. బీజాపుర్, DRG, బస్తర్ పోలీసు బలగాలకు మావోయిస్టులకు మధ్య హోరా హోరీగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు హతమాయ్యారు. చనిపోయిన మావోయిస్టులను గంగలూర్ ఏరియా కమిటీ ప్లాటూన్ డిప్యూటీ కమాండర్ పాండు అలియాస్ మద్వి, ముంగ నయపరగా గుర్తించారు.సంఘటనా స్థలం నుండి 09MM పిస్టల్, 01 టిఫిన్ బాంబ్, 01 కుక్కర్ బాంబ్, పేలుడు పదార్థాలు, ఇతర రోజువారీ ఉపయోగించే వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.