కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై ఎస్ఎఫ్ఐ నిరసన వ్యక్తం చేసింది. ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ఇంటర్ బోర్డును ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ నాయకులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో నారాయణ, చైతన్య కళాశాలల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే, రాష్ట్రంలో ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్న కార్పొరేట్ కళాశాలలను కూడా ఇంటర్ బోర్డు నియంత్రించాలన్నారు. కారేట్ విద్యాసంస్థలపై విజిలెన్స్ దాడులు నిర్వహించాలని కోరారు.