ములుగు కేంద్రంగా వచ్చిన భూకంపంతో భాగ్యనగర వాసులు వణికిపోయారు. ఎందుకంటే.. హైదరాబాద్లోనూ పలు ప్రాంతాల్లో భూమి కంపించింద. ఉదయం పిల్లలు స్కూలుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో, ఉద్యోగులు ఆఫీసులకు రెడీ అవుతున్నప్పుడు ఒక్కసారిగా కలకలం చెలరేగింది. కొన్ని సెకనుల పాటు ఆయా ప్రాంతాల్లో భూమి కంపించింది.
హైదరాబాద్లోని మణికొండ, బండ్లగూడ జాగీర్, అబ్దుల్లాపూర్ మెట్, వనస్థలిపురం, కిస్మత్పూర్, అత్తాపూర్, నార్సింగి, రాజేంద్రనగర్, హయత్నగర్ తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో, హైదరాబాద్లో ఉద్యోగాలు, ఉపాధి కోసం వచ్చి నివసిస్తున్నవాళ్లకోసం కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చెందారు. బంధుమిత్రులకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు.