ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ వక్ఫ్ బోర్డును రద్దు చేసింది. ఈ మేరకు 47 జీవోను ఉపసంహరించింది. త్వరలో కొత్త వక్ఫ్ బోర్డు నియమించేందుకు కసరత్తులు చేస్తు్న్నట్టు ప్రకటించింది.
ఇప్పటివరకు కొనసాగుతున్న వక్ఫ్ బోర్డును గతం జగన్ ప్రభుత్వం చేసింది. ఆ వక్ఫ్ బోర్డులో అక్రమాలు జరిగాయని NDA కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూటమి నేతలు ఆరోపణలు చేస్తున్నారు.