- తెలంగాణ బిజెపి అధ్యక్ష ఎంపికపై కసరత్తు పూర్తి
- ఈటెల వైపే అధిష్టానం మొగ్గు
- త్వరలోనే అధికారిక ప్రకటన
- తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు
- వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రచార కమిటీపై నో క్లారిటీ
తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఏ క్షణమైనా ఢిల్లీ నుంచి ప్రకటన రావచ్చని నేతలు భావిస్తున్నారు. నిజానికి ఈ అధ్యక్ష ఎన్నిక ఒక నెల ముందుగానే జరగాల్సి ఉండగా జిల్లా అధ్యక్షుల ఎంపిక విషయాల్లో కొంత జాప్యం జరగడం వల్ల రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన కూడా ఆలస్యమైందని నేతలు అంటున్నారు. కొత్త అధ్యక్షుడితోపాటు ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు.. ఒక ప్రచార కమిటీ చైర్మన్ ని కూడా నియమించాలని ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లుగా తెలిసింది అయితే దీనిపై ఇప్పటికిప్పుడు ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం లేదని ప్రచారం జరుగుతుంది.
కొత్త అధ్యక్షులు ఎవరు అనే విషయంపై దాదాపుగా ముఖ్య నేతలకు క్లారిటీ వచ్చినట్లుగా తెలిసింది. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కే ఈ బాధ్యతలు అప్పగించాలని నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. చాలాకాలం నుంచి ఈటల రాజేందర్ పేరు వినిపిస్తున్నప్పటికీ చివరి నిమిషంలో కొన్ని అంశాలు తెరపైకి రావడం… ఇతర విభాగాల కారణంగా ఈ ఎన్నిక విషయానికి సంబంధించి అధిష్టానం ఆచితూచి అడుగులు వేసింది..
కచ్చితంగా రానున్న కాలంలో తెలంగాణలో పార్టీకి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయని కేంద్ర నాయకత్వం భావిస్తుంది. యాక్టివ్గా ప్రజల్లోకి వెళ్లే నాయకుడికి ఈ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. ప్రజలు బిజెపి పట్ల ఆసక్తి చూపుతున్న రాష్ట్ర నాయకత్వంలో ఉన్న లోపాల వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదనేది కొందరు వాదన. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఈటల రాజేందర్ బీసీ కావడం కూడా ఆయనకు కలిసి వచ్చింది. ఉద్యమ నేతకు ఇచ్చామన్న ఇమేజ్ రావడంతో పాటు అన్ని రకాలుగా పార్టీని సమన్వయం చేస్తూ ముందుకు వెళ్లే బాధ్యత వీటిలకు అప్పగించనున్నారు.
సంఘ పరివార్ నుంచి కూడా ఈటలకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టుగా తెలిసింది. బిజెపి ఇప్పటికే కొత్తగా పార్టీలో చేరిన వారికి కూడా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సందర్భాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికలు లక్ష్యంగా చేసుకొని ఈటెలకి బాధ్యతలు అప్పగిస్తున్నట్లుగా తెలిసింది.