29.3 C
Hyderabad
Sunday, March 15, 2026

Live Video

spot_img

సెమీ క్రిస్మస్‌ వేడుకలపై భట్టి సమీక్ష

డిసెంబర్ 25 న క్రిస్మస్ పర్వదినం పండుగ ను పురస్కరించుకొని ప్రజా ప్రభుత్వం నిర్వహించనున్న సెమీ క్రిస్మస్ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు నిర్వహణ, కమిటీ ఏర్పాటుపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. క్రిస్మస్ సెలబ్రేషన్ నిర్వహణపై రాష్ట్రస్థాయి కమిటీతో పాటు ప్రతి నియోజకవర్గంలో నిర్వహించే వేడుకలకు సంబంధించి కూడా కమిటీలు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిహెచ్ఎంసిలో కూడా వేడుకల నిర్వణకు సంబంధించి కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. కమిటీల ఏర్పాటు తర్వాత వేడుకల నిర్వాహణకు సంబంధించిన పూర్తి యాక్షన్ ప్లాన్ తో రావాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మైనార్టీ వెల్ఫేర్ స్పెషల్ సెక్రటరీ తాప్సీద్ ఇక్బాల్, మైనార్టీ వెల్ఫేర్ కమిషనర్ యాస్మిన్, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ఎండి సబిత, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రెటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com