ఢిల్లీలో అమిత్ షాతో కేటీఆర్ భేటీ..
సోషల్ మీడియాలో సంచలన పోస్టింగ్ చేసిన తెలంగాణ కాంగ్రెస్..
బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనానికి డీల్ కుదిరిందంటూ తెలంగాణ పొలిటికల్ సర్కిల్సులో గుసగుసలు.
కాంగ్రెస్ పార్టీ అధికారిక x హ్యాండ్లర్ ఆపన్నహస్తం వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్టింగ్ పెట్టింది. అమిత్ షాతో కేటీఆర్ భేటీ అయిన ఫొటోను ట్వీట్ చేసింది. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కేటీఆర్ కలవనే లేదని.. అమిత్ షాతో కలిశారని.. డీల్ కుదిరిందంటూ పోస్టింగులు పెట్టింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇది తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తాను అరెస్టును ఆపించుకునేందుకు.. తన అరెస్టుకు గవర్నర్ నుంచి పర్మిషన్ ఇవ్వకుండా చూడాలని కోరుతూ బీజేపీ పెద్దల వద్దకు కేటీఆర్ వెళ్లారని.. కాళ్లా వేళ్లా పడ్డారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ కామెంట్లకు మరింత బలం చేకూరేలా అమిత్ షా-కేటీఆర్ భేటీ ఉంది. మేమేం చేసినా బాజాప్తానే చేస్తామని చెప్పుకునే కేటీఆర్ అమిత్ షాను తాను కలిసిన విషయాన్ని ఎందుకు బాజాప్తాగా ప్రకటించ లేదు.. గుట్టు చప్పుడు కాకుండా ఎందుకు దాచి పెట్టారని తెలంగాణ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేనని.. కారు గూట్లోకి కమలం చేరడం ఖాయమని.. వీలైతే వీలినానికి సిద్దంగా ఉందని వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తూ ఉంటాయి. అమిత్ షా-కేటీఆర్ భేటీ తర్వాత ఇప్పుడు మళ్లీ బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం గురించి తెలంగాణ రాజకీయాల్లో డిస్కషన్ మొదలైంది. ఢిల్లీ మద్యం స్కాంలో కవిత జైలుకెళ్లి.. మళ్లీ బెయిలుపై బయటకు వచ్చినప్పుడు జరిగిన విలీనం చర్చ.. ఇప్పుడు మళ్లీ జరుగుతోంది. కూతురు అరెస్టుతో సగం డీలా పడ్డ కేసీఆర్.. కొడుకు అరెస్టును చూడలేరని.. కాబట్టి విలీనం డీల్ గురించి మాట్లాడ్డానికి కేసీఆరే తన కొడుకు కేటీఆరును ఢిల్లీకి పంపారనేది తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ట్రెండింగులో ఉన్న టాక్. ఈ విలీనం రాజకీయం ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి.