28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమ బాట

ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు వైయస్‌ఆర్‌సీపీ సిద్దమైంది. ఇప్పటివరకు జిల్లాల వారిగా స్థానిక నేతలు ఆందోళనలు నిర్వహించగా… ఇక నుంచి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రజా క్షేత్రంలోకి రానున్నారని తెలిసింది. ఇందుకు ఈ నెల 11వ తేదీ ముహూర్తంగా ఖరారైనట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రతి జిల్లాలో రెండు నుంచి మూడు నియోజకవర్గాల్లో జరిగే పార్టీ కార్యకర్తల సమావేశాల్లో పాల్గొంటారు. నేతలు, కార్యకర్తలతో జగన్ నేరుగా సమావేశం అవుతారని అంటున్నారు.

ఉద్యమ బాటలో భాగంగా పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసులపై న్యాయ పోరాటం సాగించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే పలు దఫాలుగా జిల్లాల నాయకులతో జగన్ సమావేశాన్ని సైతం నిర్వహించారు. వైసీపీ సోషల్ మీడియాకు చెందిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్న తరుణంలో జగన్ సీరియస్ అయ్యారు.  కూటమి ప్రభుత్వం అబద్దపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని, ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.

ఈ క్రమంలో జగన్ వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమ బాట షెడ్యూల్ ను ప్రకటించారు. డిసెంబరు 11న రైతుల తరఫున వారి సమస్యల పరిష్కారానికి పోరాటం చేయనున్నట్లు, అందులో భాగంగా ర్యాలీగా వెళ్లి అన్ని జిల్లాల కలెక్టర్లకి వినతిపత్రం అందజేస్తామన్నారు. కూటమి ప్రభుత్వంపై అన్యాయంగా విద్యుత్ ఛార్జీలు పెంచిందని, దీనితో ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు తప్పవని జగన్ అన్నారు. కరెంట్ ఛార్జీల బాదుడే బాదుడుపై డిసెంబరు 27న ప్రజలతో ర్యాలీ నిర్వహించి, అన్ని జిల్లాల ఎస్‌ఈ, సీఎండీ కార్యాలయాల్లో వినతిపత్రం అందించే కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కొత్త ఏడాది జనవరి 3న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు సాగిస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com