- ఆగంతకుడి దాడిపై సైఫ్ వివరణ
- సకాలంలో ట్రీట్ మెంట్ కోసమే…
- కరీనా తనను ముందు పంపిందన్న సైఫ్
- రెండో కొడుకు పసివాడు కావడమే కారణం
- తైమూర్ ను అక్క ఇంట్లో ఉంచి ఆస్పత్రికి కరీనా
- పక్షవాతం ప్రమాదం నుంచి బయటపడ్డానన్నసైఫ్
బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ కత్తిపోట్ల వ్యవహారంపై రకరకాల కథనాలు వెలుగుచూశాయి. ఆయన వెంట భార్య కరీనా ఆస్పత్రికి వెళ్లకపోవడం, ఆ తర్వాత వెళ్లడంపై కొందరు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. మరికొందరు ఇంకొంచెం దూరం వెళ్లి సైఫ్ పై దాడి కరీనా ప్లానే అని, ఆమె చేయించిందని కూడా ఆరోపించారు. సైఫ్, కరీనా మధ్య వారసుల ఆస్తుల విషయంలో కాస్త బేధాభిప్రాయాలు ఉండటం, సైఫ్ తీరుపై కరీనా సంతృప్తిగా లేదన్న వార్తలు విన్నవారు కూడా ఆమే ఇది చేయించి ఉంటుందని ఊహించారు. అయితే ఈ ఆరోపణలన్నింటికీ సైప్ ఫుల్ స్టాప్ పెట్టాడు.
చిన్నవాడి క్షేమం కోరి…
ఆగంతకుడు తనపై దాడి చేసినప్పుడు ఇంటిల్లి పాదీ హడలి పోయారని, ఇంట్లో మరో చిన్న కొడుకు ఉండటం వాడికి ఆగంతకుడు ప్రాణహాని తలపెడతాడేమోనన్న భయంతో కరీనా తనను తన పెద్ద కొడుకును ముందు ఆస్పత్రికి పంపిందని, ఆపై తాను ఆదరాబాదరా రెండో కొడుకుని అక్క కరిష్మా ఇంట్లో దిగబెట్టి ఆ వెంటనే ఆస్పత్రికి వచ్చిందని సైఫ్ వివరించాడు. తనకు అప్పటికే రక్తం బాగా పోవడం, ఇల్లంతా రక్తం మడుగులా మారడంతో కరీనా తన ఆరోగ్యానికి ప్రయారిటీ ఇచ్చి పెద్ద కొడుకు జహంగీర్ ను తీసుకుని ముందు ఆస్పత్రికి వెళ్లమని గొడవ చేసిందని రెండో కొడుకు తైమూర్ ను తీసుకుని తాను మరో వాహనంలో బయటపడిందని సైఫ్ చెప్పాడు. ఆగంతకుడుని రెండో కొడుకు బెడ్ రూమ్ లో బంధించామని అయితే అందులోని బాత్ రూమ్ లో పైప్ లైన్ నుంచి వచ్చిన దోవనే అతగాడు పారిపోయాడని అన్నాడు.
కొంచెముంటే పక్షవాతం వచ్చేది…
తనకు తీవ్ర రక్త స్రావంతో కంగారు పడినట్లు అందుకే ఆటోలో జహంగీర్ తో కలసి వెళ్లినట్లు తెలిపాడు. దారిలో తన ప్రాణాలే పోతాయన్నంత బాధని అనుభవించానని సైఫ్ తెలిపాడు. ఆస్పత్రిలో డాక్టర్లు తన వెనక దిగబడిన కత్తిని తీసి ప్రాణాపాయం నుంచి తప్పించి మూడు సర్జరీలు చేశారని వెన్నులోనుంచి ద్రవం లీక్ కాకుండా సకాలంలో చికిత్స చేశారని సైఫ్ అన్నాడు. కత్తి కాస్త వెన్ను పాముని తాకి ఉంటే తాను శాశ్వతంగా పక్షవాతంతో మంచం పట్టేవాడినని సైఫ్ చెప్పుకొచ్చాడు. తనపై దాడిపై రకరకాల కథనాలు వెలుగు చూడటంతో తాను వేదన చెందానని, కరీనా తన క్షేమం కోరే ముందు పంపిందని సైఫ్ తెలిపాడు.సైఫ్ వివరణతో ఈ మిస్టరీ వీడిందనే అనుకోవాలి.