నేతాజీ బిరుదాంకితుడు సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి జనవరి 23
సుభాష్ చంద్రబోస్… నేతాజీ అని ప్రాచుర్యం పొందిన భారతదేశ ఆజాదీ పోరాటంలో ప్రముఖ నాయకుడిగా నిలిచారు. ఆయన నాయకత్వం, త్యాగం, దేశభక్తి అనేకమంది భారతీయులను ప్రేరేపించింది. ముఖ్యంగా భారత జాతీయ సైన్యం (ఇండియన్ నేషనల్ ఆర్మీ – INA) స్థాపన ద్వారా ఆయన భారత స్వాతంత్ర సంగ్రామంలో చరిత్రాత్మక స్థానాన్ని సంపాదించారు.
పూర్తి పేరు: సుభాష్ చంద్రబోస్
పుట్టిన తేదీ: 1897 జనవరి 23
పుట్టిన స్థలం: కటక్, ఒడిశా, బ్రిటిష్ ఇండియా
భారత స్వాతంత్ర పోరాటంలో పాత్ర: నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు
ప్రముఖ నినాదం: “తుమ్ ముఝే ఖూన్ దో… మై తుమ్హే ఆజాదీ దూంగా” (నువ్వు నాకు రక్తం ఇస్తే, నేను నీకు స్వాతంత్రం ఇస్తాను)
స్మృతి: భారత స్వాతంత్ర పోరాటంలో నేతాజీ పాత్ర భారతీయుల హృదయాల్లో స్ఫూర్తిగా నిలిచింది.
సుభాష్ చంద్రబోస్ జననం
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న ఒడిశాలోని కటక్లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు జానకీనాథ్ బోస్, ప్రభావతి దేవి దంపతులకు నేతాజీ తొమ్మిదవ సంతానం. బాల్యంలోనే ఆయన దేశభక్తిని ప్రదర్శిస్తూ ఉన్నత విద్య అభ్యసించారు.
సుభాష్ చంద్రబోస్ చరిత్ర
భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో సుభాష్ చంద్రబోస్ ఒక యుగపురుషుడు. ఆయన స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ (భారత జాతీయ సైన్యం) అనేకమంది భారతీయులను బ్రిటిష్ వారి చీకటి పాలనపై తిరుగుబాటు చేయడంలో ప్రేరేపించింది.
మరణం: 1945 ఆగస్టు 18న తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించారని అధికారికంగా వెల్లడించారు.
సుభాష్ చంద్రబోస్ కుటుంబం
తండ్రి జనకీనాథ్ బోస్ ప్రఖ్యాత న్యాయవాది.
ఆయన సోదరుడు శరత్ చంద్రబోస్ స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు.
భార్య ఎమిలీ షెంకెల్ ఆస్ట్రియాకు చెందినవారు. వీరికీ అనిత బోస్ ప్ఫాఫ్ అనే కూతురు ఉంది.
సుభాష్ చంద్రబోస్ ముఖ్య సిద్ధాంతాలు
1. పూర్తి స్వాతంత్రం: బ్రిటిష్ పాలనకు పూర్తిగా ముగింపు తీసుకురావాలని నేతాజీ విశ్వసించారు.
2. సెక్యులరిజం: అన్ని మతాలను సమానంగా చూసే సమాజం కోసం పునరుద్ధరణ చేశారు కానీ దేశ అస్తిత్వం హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి అని పిలుపునిచ్చారు.
3. ఆర్థిక సమానత్వం: సామాజిక అణచివేత తొలగించాలని, పేదవారికి సౌలభ్యం కలిగించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
4. సైనిక ఉద్యమం: గాంధీజీ విధానాలకు భిన్నంగా, స్వాతంత్రం కోసం ఆయుధ పద్ధతిని అమలులోకి తెచ్చారు.
ఆజాద్ హింద్ ఫౌజ్ (ఇండియన్ నేషనల్ ఆర్మీ – INA)
1943లో జపాన్ సహాయంతో సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ను మరింత బలోపేతం చేశారు.
ఉద్దేశ్యం: సైనిక చర్యల ద్వారా బ్రిటిష్ పాలనను గడగడలాడించడమే ప్రధాన లక్ష్యం.
ఘనతలు:
“ఢిల్లీ చలో” నినాదం.
ఆజాద్ హింద్ సర్కార్ స్థాపన (1943).
మహిళల కోసం రాణి ఝాన్సీ రెజిమెంట్ ఏర్పాటు.
ముఖ్య సంఘటనలు
1. 1938: హరిపుర కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడిగా ఎన్నిక.
2. 1939: ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ స్థాపన.
3. 1941: బ్రిటిష్ హౌస్ అరెస్ట్ నుండి పారిపోవడం.
4. 1945: విమాన ప్రమాదంలో మరణం (వివాదాస్పదంగా ఉంటుంది).
సుభాష్ చంద్రబోస్ జీవిత కథ మనకు దేశభక్తిని, త్యాగాన్ని, సమానత్వాన్ని స్ఫూర్తిగా అందిస్తుంది. భారత ప్రభుత్వం నేతాజీ జయంతిని పరాక్రమ్ దివాస్(శౌర్య దివాస్)గా ప్రతి ఏటా నిర్వహిస్తోంది. భారత స్వాతంత్ర పోరాటంలో నేతాజీ పాత్ర చిరస్థాయిగా భారతీయుల గుండెల్లో నిలిచింది.