కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని నిర్మల్ జిల్లా ముఖరా కే గ్రామస్థులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సంక్రాంతి సందర్భంగా ముగ్గులతో ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రకటించారు.
రైతు భరోసా గోవిందా, తులం బంగారం గోవిందా, రైతు రుణమాఫీ గోవిందా, 4000 పింఛను గోవిందా, మహాలక్ష్మి 2500 గోవిందా, ఆరు గ్యారంటీలు గోవిందా అంటూ ముగ్గులు వేసి నిరసన తెలిపిన గ్రామస్తులు.
6 గ్యారంటీలు నమ్మి మోసపోయామని,100 రోజులో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదని, రైతు భరోసా 15000 ఇస్తానని చెప్పి రెండు సీజన్లు ఎగగొట్టాడు అని, రుణమాఫీ కాలేదని, ఆరు గ్యారంటీలు బోగస్ అయ్యాయని అన్నారు.
రైతు భరోసా రాక పండుగ చేసేదేలా అంటూ ఇంటి ముందు ముగ్గులు వేసి నిరసన తెలిపిన ఇచ్చోడ మండలం ముఖ్రా గ్రామస్తులు.